రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ చలపతిరావు
- విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్ష
- కైకలూరు సమగ్రాభివృద్ధికి గణనాథుని ఆశీస్సులు ఉండాలి: నల్లగోపుల వెంకట చలపతిరావు
కైకలూరు:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికుల సంక్షేమ బోర్డు డైరెక్టర్, కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ నల్లగోపుల వెంకట చలపతిరావు రాష్ట్ర ప్రజలకు, కైకలూరు నియోజకవర్గ ప్రజానీకానికి, కూటమి శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను హరించే ఆ విఘ్నాధిపతి దివ్య కృపాకటాక్షాలతో ప్రజల జీవితాల్లోని కష్టాలు, ఆటంకాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శ్రేయస్సు వెల్లివిరియాలని కోరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనలో, కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనలో కార్మికులు, పేద ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకులనే పూజిస్తూ, ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
