ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్
- విఘ్నాలు తొలగి అభివృద్ధి పథంలో పెడన దూసుకుపోవాలి
- ప్రజల కోసం… అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేద్దాం: కాగిత కృష్ణప్రసాద్ పిలుపు
పెడన:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి శ్రేణులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రగతికి కొత్త మార్గాలు తెరుచుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రి శ్రీ నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని, పెడన ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తోందన్నారు. దివంగత నేత కాగిత వెంకట్రావు గారి ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు నిండాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మన ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరం ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక ప్రతిమలనే పూజిస్తూ, పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కోరారు.
