జనగళం 24 ఆంధ్ర డెస్క్: నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు పార్లమెంటరీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర్ను స్థానిక హోటల్ మినర్వా గ్రాండ్లో జిల్లా సీనియర్ నాయకులు పి. టోనీ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.
స్థానిక సంస్థల సమరంలో జనసేన పార్టీ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా, విజయ అవకాశాలు స్పష్టంగా ఉన్న స్థానాలు, డివిజన్లలో నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించేలా సీట్ల కేటాయింపు ప్రణాళికలు రూపొందించాలని టోనీ బాబు కోరారు. ఈ అంశంపై తమ్మిరెడ్డి శివశంకర్ అత్యంత సానుకూలంగా స్పందిస్తూ, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జనసేన శ్రేణులకు తగిన గుర్తింపు, సముచిత ప్రాధాన్యత కల్పించేలా సీట్ల కేటాయింపుపై పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకులు బుదూరు వెంకటేష్, షేక్ షానవాజ్, కాకి శివకుమార్, బద్రి తదితరులు పాల్గొన్నారు.
