గుంటూరు పార్లమెంట్ పరిధిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు విస్తృత కసరత్తు ప్రారంభించాయి. మంగళగిరి–తెనాలి ఫ్లైఓవర్ సమీపంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కీలక సమన్వయ సమావేశంలో విజయవాడ, గుంటూరు పార్లమెంట్ స్థానిక ఎన్నికల సమన్వయకర్త, మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా గుంటూరు కార్పొరేషన్, పరిధిలోని మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల వారీగా పార్టీకి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న స్థానాల ప్రాథమిక జాబితాను ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు మంత్రికి అందజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన వ్యూహాత్మక కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.
Slug: guntur-parliament-janasena-local-body-elections-coordination-meeting-minister-kandula-durgesh-mangalagiri
