ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సోము వీర్రాజు
- వరసిద్ధి వినాయకుని కృపతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, విజయాలు వెల్లివిరియాలని ఆకాంక్ష
రాజమహేంద్రవరం:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ సోము వీర్రాజు రాష్ట్ర ప్రజలకు, రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించే ఆ వరసిద్ధి వినాయకుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. గణనాథుని కృపతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, ప్రజలంతా నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
