- ఈ నెల 17న పెడన పట్టణంలో టీడీపీ విస్తృత స్థాయి క్యాడర్ సమావేశం
- ముఖ్య అతిథిగా విచ్చేయనున్న మంత్రి శ్రీ నారా లోకేష్
- పర్యటన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే
పెడన:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి పెడన పర్యటన ఏర్పాట్లను పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ నెల 17వ తేదీ గురువారం ఉదయం 10:00 గంటలకు పెడన పట్టణంలోని ఫ్లైఓవర్ ఆపోజిట్ ప్రాంతంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ క్యాడర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీ నారా లోకేష్ విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మంత్రి గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశ ప్రాంగణం వద్ద వేదిక నిర్మాణం, నాయకులు, కార్యకర్తల రాకపోకలు, పార్కింగ్, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనపై నాయకులతో చర్చించి పలు సూచనలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ క్యాడర్ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
