రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK)
- విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, విజయాలు నిండాలని ఆకాంక్ష
- పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజిద్దాం: కేకే పిలుపు
మంగళగిరి / అమరావతి:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) రాష్ట్ర ప్రజలకు, జనసేన-కూటమి శ్రేణులకు, పోలీస్ శాఖ కుటుంబాలకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి విజయాన్ని చేకూర్చే ఆ గణనాథుని దివ్య కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలు తలపెట్టే ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు. పోలీస్ సిబ్బంది మరియు రాష్ట్ర ప్రజలందరి కుటుంబాలలో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, శ్రేయస్సు వెల్లివిరియాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూనే, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. ఉత్సవ కమిటీలు భద్రతా నిబంధనలు పాటిస్తూ నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
