బ్రేకింగ్ న్యూస్
శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏
ఆంద్ర ప్రదేశ్

నివాసంలో వినాయక చవితి పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

నివాసంలో వినాయక చవితి పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

  • కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లి నివాసంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు
  • ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలుగుజాతి వర్ధిల్లాలని ఆకాంక్ష
  • ఐక్యతకు, సమష్టితత్వానికి ప్రతీక వినాయక చవితి: ముఖ్యమంత్రి

అమరావతి:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసంలో విఘ్నేశ్వరుడికి శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Related News Desk పత్రికా ప్రకటన

​ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక అని కొనియాడారు. ఏ శుభకార్యాన్ని తలపెట్టినా ముందుగా వినాయక పూజతో ప్రారంభించడం మన సనాతన సంప్రదాయమని గుర్తుచేశారు. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే వినాయక చవితి వేడుకలు సమాజంలో సామాజిక స్పృహను, సమష్టితత్వాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసుకుని ప్రజలంతా కలిసికట్టుగా జరుపుకునే ఈ ఉత్సవాలు మన సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు.

​ఆ వినాయకుడి దివ్య ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా సాగాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి సగర్వంగా వర్ధిల్లాలని ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన వినాయక చవితి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.