ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా సరికొత్త హెక్టార్ కారును విపణిలోకి ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ వాహనం, దేశీయ మార్కెట్లో తొలి మల్టీ-న్యూ ఎనర్జీ వెహికల్ ప్లాట్ఫామ్పై రూపుదిద్దుకున్న మొట్టమొదటి ఉత్పత్తిగా నిలిచింది. ఈ సరికొత్త మోడల్కు సంబంధించి ధరల వివరాలను కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ-ఏస్-ఏ-సర్వీసెస్ కింద ప్రారంభ ధర రూ.13.99 లక్షలు మరియు కిలోమీటర్కు రూ.4.90 బ్యాటరీ రెంటల్గా నిర్ణయించారు. అలాగే మరో మోడల్ ధర రూ.21.79 లక్షలు ఉండగా, కిలోమీటర్కు రూ.3.20 చొప్పున బ్యాటరీ రెంటల్ వసూలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ నూతన వాహనంలో అమర్చిన 69.2 కిలోవాట్ల మ్యాజిక్ బ్యాటరీ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల మైలేజీ లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ బ్యాటరీపై లైఫ్టైమ్ వారెంటీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఏడుగురు కూర్చునే విధంగా ఈ కారును తీర్చిదిద్దారు. కేవలం 9 సెకన్ల వ్యవధిలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఈ వాహనానికి ఉందని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ కారులో అనేక ఆధునిక వసతులను పొందుపరిచారు. ఇందులో 15.6 ఇంచుల హెచ్డీ డిస్ప్లేతో పాటు లెవల్ 2 అడాస్, ఐ-స్మార్ట్ 3.0, ఎనభైకి పైగా కొత్త ఫీచర్లు అలాగే జెన్ ఏఐ పవర్ వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
