విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,శాంతి,సౌభాగ్యాలతో జీవించాలని ఏలూరు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకాంక్షించారు.ప్రతి కుటుంబంలో ఆనందం,ఐశ్వర్యం వెల్లివిరియాలని,జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని గణనాథుని ప్రార్థిస్తున్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో,ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టరు కోరారు.
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
