విజయవాడలో జనసేన బలబలాలపై చర్చించిన అమ్మిశెట్టి వాసు – దిశానిర్దేశం చేసిన మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా కో-ఆర్డినేటర్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో-ఆర్డినేషన్ టీమ్ మరియు సపోర్టు టీమ్ సభ్యులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గ మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు పాల్గొని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ నగర పరిధిలో జనసేన పార్టీ పోటీ చేయదగిన డివిజన్లు, పార్టీ బలాబలాలు మరియు క్షేత్రస్థాయి పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. నగరంలో జనసేన బలంగా ఉన్న డివిజన్లలో విజయావకాశాలను విశ్లేషించి, ఎన్నికల వ్యూహాలపై నేతలకు తగిన సలహాలు, సూచనలు అందజేశారు. కూటమి సమన్వయంతో వార్డు స్థాయి నుంచి కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన్ (కాళీ దాసు), విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బొలిశెట్టి వంశీకృష్ణ, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి మరియు పార్లమెంటరీ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
