విజయవాడ:
త్వరలో జరగనున్న విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికల నేపథ్యంలో బెజవాడ రాజకీయాల్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తనయుడు కేశినేని వెంకట్ బాబు మేయర్ అభ్యర్థిత్వ రేసులో ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
నగరానికి ఆధునిక రూపురేఖలు తీసుకురాగల యువ నాయకత్వం అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో, యువతకు చేరువ కాగల వ్యక్తిగా వెంకట్ బాబు పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్హతలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉన్న యువతకు కార్పొరేషన్ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ కూటమి శ్రేణుల్లో జోరందుకుంది. రానున్న రోజుల్లో బెజవాడ మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
