ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్
- విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, విజయాలు నిండాలని ఆకాంక్ష
- పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: అజయ్ వర్మ ఠాకూర్ పిలుపు
విజయవాడ:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి కృష్ణా జిల్లా సోషల్ జస్టిస్ మాజీ అధ్యక్షులు శ్రీ అజయ్ వర్మ ఠాకూర్ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి, జనసేన-కూటమి శ్రేణులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సమాజంలో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం మరింత పరిఢవిల్లాలని, ప్రజల జీవితాల్లోని కష్టాలన్నీ ఆ గణనాథుని కృపతో తొలగిపోవాలని కోరుకున్నారు.
మన సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకు విశిష్ట స్థానం ఉందని గుర్తుచేస్తూ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని పిలుపునిచ్చారు. నవరాత్రి మహోత్సవాలను ప్రజలంతా సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీ అజయ్ వర్మ ఠాకూర్ కోరారు.
