జనగళం 24 ఆంధ్ర డెస్క్: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం గురువారం కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలో జరగనుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ప్రజా దర్బార్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ గ్రీవెన్స్ సభకు అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు, వినతిపత్రాలు స్వీకరించి, అక్కడికక్కడే శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండే ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
