జనగళం 24 ఆంధ్ర డెస్క్: సేన పత్రిక అధిపతి, ప్రముఖ జర్నలిస్ట్ ఉద్యమ నాయకులు అద్దంకి శ్రీనివాసరావును కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కైకలూరులోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న అద్దంకి శ్రీనివాసరావు నివాసానికి నేతలు స్వయంగా వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, శస్త్రచికిత్స అనంతరం అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో కాపు జేఏసీ ప్రముఖ నాయకులు భశెట్టి ప్రసాద్, ఖమ్మం జిల్లా మున్నూరుకాపు యూత్ అధ్యక్షులు మాటేటి రవి కూడా పాల్గొన్నారు. శ్రీనివాసరావు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని యథావిధిగా ప్రజాసేవ, జర్నలిజం రంగంలో తన గళాన్ని వినిపించాలని నేతలు ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
