జనగళం 24 ఆంధ్ర డెస్క్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త హోదాలో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్కు ఒంగోలులో ఘన స్వాగతం లభించింది. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా) చైర్మన్, జిల్లా ప్రముఖ నాయకులు షేక్ రియాజ్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు.
స్థానిక సంస్థల సమరానికి పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సమాయత్తం చేసేందుకు, కూటమి నాయకులతో ఎన్నికల కార్యాచరణపై విస్తృతంగా చర్చించేందుకు ఆయన ఒంగోలు పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులు, క్షేత్రస్థాయి బలాబలాలు, ఎన్నికల సన్నాహాలపై నేతలు ప్రాథమికంగా సమాలోచనలు జరిపారు. కూటమి ఐక్యతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించేలా ప్రణాళికలు రచించాలని నిర్ణయించారు
