ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు & ప్రాచ్య భాషా విభాగం ఆధ్వర్యంలో ఆచార్య నారిశెట్టి వేంకట కృష్ణారావు రచించిన “రెక్కలు విప్పిన గాలి” కవితా సంపుటి ఆవిష్కరణ, అంకితోత్సవ సభ ఘనంగా జరిగింది. డైక్మన్ ఆడిటోరియంలోని ఆచార్య వి.బాలమోహన్ దాస్ సెమినార్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఈ విశిష్ట కవితా సంపుటిని మాజీ మంత్రివర్యులు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావుకు రచయిత అంకితం ఇచ్చారు. ఏఎన్యూ ఉపకులపతి ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్. విజయభాస్కరరావు, వర్సిటీ రెక్టార్ ఆచార్య ఆర్. శివరామప్రసాద్, ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ జి.వి. పూర్ణచందు, గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు తదితరులు పాల్గొని పుస్తకంపై సమగ్ర సమీక్ష గావించారు.
Slug: acharya-nagarjuna-university-rekkalu-vippina-gaali-poetry-book-launch-mandali-buddha-prasad
