రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జనసేన పార్టీ సమన్వయ సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా ఎన్నికల సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల పార్టీలో చేరిన డిప్యూటీ మేయర్, 20 మంది కార్పొరేటర్లతో పాటు ఒంగోలు జిల్లా ఎన్నికల కమిటీ బృందం ఈ సమావేశంలో పాల్గొంది.
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన విధివిధానాలు, కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీలతో క్షేత్రస్థాయి సమన్వయం, అనుసరించాల్సిన వ్యూహాలపై తమ్మిరెడ్డి శివశంకర్ సమగ్ర సూచనలు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థుల భారీ గెలుపే లక్ష్యంగా పాత, కొత్త నాయకులంతా విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
