స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ సమన్వయ కమిటీ కో-మెంబర్గా నియమితులైన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసును పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని ఆయన కార్యాలయంలో కలుసుకుని పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కటికి రాకేష్ నాథ్, పార్టీ నాయకులు గార్లపాటి శ్రీరాం, పకోడా హబ్ ఫౌండర్ ఉండి శరత్ చంద్ర పాల్గొని అమ్మిశెట్టి వాసుకు అభినందనలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల సమరంలో విజయవాడ నగరంతో పాటు పార్లమెంట్ పరిధిలోని డివిజన్లలో పార్టీని విజయపథంలో నడిపించేందుకు సమష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.
Slug: ammisetty-vasu-appointed-vijayawada-parliament-local-body-coordination-member-leaders-congratulations
